Webdunia - Bharat's app for daily news and videos

Install App

Husband Sucide: భార్యను హతమార్చాడు.. సమాధి వద్దే ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 9 డిశెంబరు 2024 (10:52 IST)
భార్యతో జరిగిన గొడవలో భర్త ఆమెను హతమార్చాడు. దీంతో జైలుపాలైన భర్త ఆరు నెలల తర్వాత బెయిల్‌పై వచ్చి..భార్య సమాధి వద్దే ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత దంపతులు బెంగళూరుకు వలస వెళ్లారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. 
 
మనస్పర్థల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవల్లో భర్త చేతిలో భార్య హతమైంది. అటుపై పోలీసులకు లొంగిపోయిన గంగిరెడ్డిని కోర్టు జైలుకు పంపించింది.
 
ఆరు నెలల పాటు జైలులో గడిపిన గంగిరెడ్డి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. శనివారం సుజాత సమాధి వద్ద ఓ చెట్టుకు వేలాడుతున్న గంగిరెడ్డి మృతదేహం కనిపించింది. భార్యను చంపేసినందుకు పశ్చాత్తపంతో గంగిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments