Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి తర్వాత ప్రియుడితోనే కూతురు.. భర్త వద్దకు వెళ్లలేదు.. తండ్రి ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (11:43 IST)
ఆధునికత పెరుగుతున్నా.. పరువు హత్యలు ఏమాత్రం తగ్గట్లేదు. పెళ్లికి ముందు మరో అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి.. పెళ్లి తర్వాత ఊరుకొచ్చి మళ్లీ తిరిగి వెళ్లలేదు. కుమార్తె ప్రవర్తనతో విసిపిపోయిన తండ్రి.. పరువు పోయిందని.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆమెను హత్య చేసి తలను మొండేన్ని వేరు చేశాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆలమూరుకు చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి ప్రసన్నకు హైదరాబాదుకు చెందిన టెక్కీతో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ప్రసన్న వేరొక వ్యక్తిని ప్రేమించింది. 
 
పెళ్లయ్యాక కూడా అతనిని మరిచిపోలేకపోయింది. పెళ్లయ్యాక గ్రామానికి వచ్చిన ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. దీంతో పరువు పోయిందని భావించిన ప్రసన్న తండ్రి ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని తీసుకెళ్లి నంద్యాల-గిద్దలూరు మార్గంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. 
 
అక్కడ కుమార్తె మృతదేహం నుంచి తలను వేరు చేసి రెండింటిని వేర్వేరు చోట్ల పడేశారు. ఆపై ఏమీ తెలియనట్లు మిన్నకుండిపోయాడు. అయితే కుటుంబీకులు అతనిని నిలదీయడంతో నిజం చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రసన్న తండ్రిని అరెస్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments