Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... నాన్నా అంటున్నా... కన్నకుమార్తెను కట్టేసి కొట్టి చంపిన తండ్రి.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (19:08 IST)
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నదని కన్నకూతుర్ని గొడ్డును కొట్టినట్లు కొట్టికొట్టి చంపేశాడు ఆమె తండ్రి. అతడికి చేతులు ఎలా వచ్చాయో... అమ్మా... నాన్నా అంటూ అరిచి అభ్యర్థించినా ఆమెను వదల్లేదు.
 
వివరాల్లోకి వెళితే... ఒకటిన్నర సంవత్సరం క్రితం పలమనేరు సమీపంలోని ఉసరపెంట గ్రామానికి చెందిన హేమావతి, కేశవులు ప్రేమించుకున్నారు. కేశవులు దళితుడు కావడం.. హేమావతి కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరు ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. 
 
సంవత్సన్నరక్రితమే వీరిద్దరికి వివాహమైంది. కేశవులు వేరు కాపురం పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఏడు రోజుల క్రితం వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. కేశవులు తల్లిదండ్రులు అన్ని మరిచిపోయి కోడలు, కొడుకును ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నారు. 
 
మధ్యాహ్నం ఆటోలో ఇంటికి వెళుతుండగా హేమావతి తండ్రి ఇంకా బంధువులు ఆటో ఆపి కేశవులపై దాడి చేశారు.హేమావతిని తాళ్లతో బంధించి అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు. హేమావతి మృతదేహాన్ని పక్కనే ఉన్న చెత్తగుంట పొలంలో పడేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments