Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల లేరన్నది ఓ నమ్మలేని నిజం : ఎమ్మెల్యే బాలకృష్ణ

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (16:43 IST)
మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద రావు మన మధ్య లేరన్నది ఓ నమ్మలేని నిజం అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన కోడెల ఆత్మహత్యపై బాలకృష్ణ స్పందించారు. 
 
కోడెల శివప్రసాదరావు తమ మధ్య లేరన్న వార్త చాలా బాధాకరంగా ఉందని, ఓ నమ్మలేని నిజం అని అన్నారు. కోడెల ఓ రాజకీయనాయకుడిగా, వైద్యుడిగా సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, అందరి హృదయాల్లో పదిలంగా ఉంటారని అన్నారు. 
 
కాగా, తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన బసవతారకం ఆస్పత్రిని కోడెల ఫౌండర్ ఛైర్మన్‌గా ముందుడి ఈ స్థాయికి తీసుకొచ్చారన్నారు. కోడెల ఎంతో మందికి ఆదర్శనీయుడని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మరిచిపోలేని సేవలు అందించారని, కోడెల ఏ పదవులో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు. 
 
అలాగే, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, కోడెల శివప్రసాద్ చివరి శ్వాస వరకూ పార్టీ కోసం పరితపించారన్నారు. వ్యక్తిగతంగా ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కోడెల కుటుంబానికి తన సంతాపం తెలిపారు. కోడెల మృతిపై మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments