Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళికూతురు ముందే పెళ్ళికొడుకును అక్కడ పట్టుకున్న హిజ్రాలు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:58 IST)
తిరుపతిలో హిజ్రాల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి. ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెళ్ళిమండపాలకు వెళుతూ పెళ్ళికొడుకు, పెళ్ళి కూతుర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆశీర్వాదం అంటూ వారి నుంచి 10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఇవ్వకపోతే..అంతే సంగతి.
 
తిరుపతి సమీపంలోని తిరుచానూరు కళ్యాణమండపంలో ఒక వివాహం జరుగుతుండగా హిజ్రాలు రెచ్చిపోయారు. నేరుగా పెళ్ళిమండపంలోకి వచ్చిన 30 మంది హిజ్రాలు పదివేలు ఇవ్వాలంటూ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురును చుట్టుముట్టారు. కాసేపు బంధువులను కూడా రానివ్వలేదు.
 
అంతేకాదు పెళ్లికొడుకు భుజంపై చేయివేసి మెల్లగా సైగ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో పెళ్ళికొచ్చిన వారు హిజ్రాల చేష్టలను చూసి ఆశ్చర్యపోయారు. వారిని ఏమీ అనలేక సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
ఎంతకూ హిజ్రాలు వెళ్ళకపోవడంతో చివరకు 10 వేలు ఇవ్వాల్సి వచ్చింది. నగదు తీసుకునేంత వరకు అక్కడి నుంచి కదల్లేదు హిజ్రాలు. ఇలా గత కొన్నిరోజులుగా హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments