Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద టెన్షన్.. పోలీసులు వెయిటింగ్... ఎందుకంటే?

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (11:58 IST)
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద పోలీసుల టెన్షన్ మొదలైంది. రఘురామకృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు ఇవ్వడానికి అధికారులు వచ్చినా ఆయన బయటికి రాకపోవడంతో ఇంటి వద్దే సీఐడీ అధికారులు వేచి వున్నారు. గతేడాది రఘురామపై క్రైం నెంబర్ 12/2021 లో 153-A, 505, 124-A R/w 120B Ipc సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 
 
ఆ కేసుకు సంబంధించి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు సూచించారు. రఘురామకు సంబంధించిన లాయర్లతో సీఐడీ పోలీసులు మాట్లాడారు. రఘురామ గురువారం నరసాపురం వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజులపాటు నరసాపురంలో పర్యటిస్తానన్నారు. ఇప్పుడు సీఐడీ నోటీసులు ఇచ్చేందుకు రావడం చర్చనీయాంశమైంది.
 
రఘురామను మే 14న సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నోటీసులిచ్చి అదుపులోకి తీసుకుని.. గుంటూరు తరలించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments