Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద టెన్షన్.. పోలీసులు వెయిటింగ్... ఎందుకంటే?

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (11:58 IST)
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద పోలీసుల టెన్షన్ మొదలైంది. రఘురామకృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు ఇవ్వడానికి అధికారులు వచ్చినా ఆయన బయటికి రాకపోవడంతో ఇంటి వద్దే సీఐడీ అధికారులు వేచి వున్నారు. గతేడాది రఘురామపై క్రైం నెంబర్ 12/2021 లో 153-A, 505, 124-A R/w 120B Ipc సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 
 
ఆ కేసుకు సంబంధించి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు సూచించారు. రఘురామకు సంబంధించిన లాయర్లతో సీఐడీ పోలీసులు మాట్లాడారు. రఘురామ గురువారం నరసాపురం వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజులపాటు నరసాపురంలో పర్యటిస్తానన్నారు. ఇప్పుడు సీఐడీ నోటీసులు ఇచ్చేందుకు రావడం చర్చనీయాంశమైంది.
 
రఘురామను మే 14న సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నోటీసులిచ్చి అదుపులోకి తీసుకుని.. గుంటూరు తరలించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments