Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా పరువు తీసిన కోడెల... కె ట్యాక్స్ పైన హైకోర్టు కీలక ఆదేశాలు

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (18:48 IST)
ఒకవైపు అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారానికి సంబంధించి కేసులు నమోదు అయ్యాయి. ఆ వ్యవహారంలో మొత్తం తెలుగుదేశం పార్టీ పరువే తీశారు కోడెల శివప్రసాదరావు. అదలా ఉంటే 'కే' ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకూ కే ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి బోలెడంత మంది ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఆ కేసుల విచారణ గురించి కోర్టు స్పందిస్తూ.. కోడెల శివప్రసాద్ రావు, ఆయన తనయుడు కోడెల శివరాంలు దిగువ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ ఆరో తేదీలోగా కోర్టుకు వెళ్లి లొంగిపోవాలని, అదే సమయంలో బెయిల్ కూడా లభిస్తుందని కోర్టు పేర్కొంది. అయితే విజయవాడను వీడి వారు బయటకు వెళ్లకూడదని కూడా కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
నమోదైన కేసుల విచారణ కోసం పోలీసులకు అందుబాటులో ఉండాలని కోర్టు పేర్కొంది. ప్రతి సోమ, బుధ, శనివారాల్లో ఆ కేసుల విచారణ కోసం పోలీసుల ముందుకు వెళ్లాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్షులను ప్రభావితం చేయడానికి వీల్లేదని కూడా వారిని కోర్టు ఆదేశించింది. ఈ కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేవరకూ కోడెల శివప్రసాద్, కోడెల శివరాంలు పోలీసుల ముందు హాజరు కావాలని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments