Webdunia - Bharat's app for daily news and videos

Install App

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

ఐవీఆర్
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (18:55 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్డీయే నేతలు అందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి అభివాదం చేస్తూ వచ్చిన ప్రధానమంత్రి మోడీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దగ్గర ఆగారు. హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి, మీరు చేయాల్సిన పని ఇంకా చాలా వుంది. అది చేసాక వెళ్లవచ్చు అనడంతో పవన్ కల్యాణ్ నవ్వుతూ అభివాదం చేసారు.
 
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హాజరయ్యారు. 
 
ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను హృదయపూర్వకంగా పలకరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన విజయాన్ని సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం 22 సీట్లకే పరిమితమైంది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments