Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో కృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (12:06 IST)
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జీవించివున్న సమయంలో ఆయన ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ ఒకమారు లోక్‌సభ సభ్యుడుగా కూడా ఉన్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి బోళ్ళ బుల్లిరామయ్యపై 71 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, రాజీవ్ గాంధీ హత్యానంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 
 
అయితే, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ మద్దతు ఇస్తూనే ఉన్నారు. గత 2004 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డికి మద్దతు తెలిపారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌కు అండగా ఉన్న కృష్ణ.. ఆ తర్వాతి కాలంలో ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. 
 
అంతేకుండా, 1972లో ఆయన జై ఆంధ్ర ఉద్యమానికి సూపర్ స్టార్ బహిరంగంగా మద్దతు ప్రకటింటారు. అదేసమయంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయడం, తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ సమయంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments