లాంచీ బాధిత కుటుంబాలను ఆదుకోండి... ప్రభుత్వ ఉద్యోగమివ్వండి...

అమరావతి : గోదావరి నదిలో లాంచీ బోల్తా ఘటనలో గల్లంతయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ సెక్రటేరియట్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘ సభ్యులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరిలో లాంచీ బోల్తా ఘటనలో 40 మంది గల్లంతయ్యార

Webdunia
బుధవారం, 16 మే 2018 (18:31 IST)
అమరావతి :  గోదావరి నదిలో లాంచీ బోల్తా ఘటనలో గల్లంతయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ సెక్రటేరియట్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘ సభ్యులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరిలో లాంచీ బోల్తా ఘటనలో 40 మంది గల్లంతయ్యారన్నారు. వారంతా నిరుపేద గిరిజన కుటుంబాలకే చెందినవారని, బాధిత కుటుంబాలకు తమ సంస్థ ప్రగాడ సానుభూతి తెలియజేస్తోందని అన్నారు. 
 
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి సహాయక చర్యలకు ఆదేశించడమే కాకుండా స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించడం అభినందనీయమన్నారు. గల్లంతయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని సెక్రటేరియట్ ఎస్.సి., ఎస్.టి., ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొంజుబాబు, ఉపాధ్యక్షులు శ్యామసుందర్ రావు, రమేష్, కార్యదర్శి నీలమయ్య కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments