Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి లాంచీ మునక: చంద్రబాబు ఏమన్నారు..? సిమెంట్ బస్తాలు తెచ్చారట..

గోదావరి లాంచీ మునక ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గోదావరి లాంచీ మునక ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందిస్తామ

Webdunia
బుధవారం, 16 మే 2018 (17:52 IST)
గోదావరి లాంచీ మునక ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గోదావరి లాంచీ మునక ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందిస్తామని.. తక్షణ సాయం కింద లక్షరూపాయలు ఇస్తామన్నారు.


వాడపల్లిలో జరుగుతున్న సహాయక చర్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులతో కలిసి పర్యవేక్షించిన అనంతరం మీడియా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇద్దరు బాలురతో పాటు 12 మంది మృతదేహాలను వెలికితీశారని.. మరో పది మృతదేహాలను వెలికి తీయాల్సి వుందని చంద్రబాబు అన్నారు. 
 
ఇప్పటివరకు ఇద్దరు బాలురు సహా 12 మంది మృతదేహాలు వెలికితీశారని, మరో 10 మృతదేహాలను వెలికి తీయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. లాంచీని మంగళవారం ఉదయం చెకింగ్‌ కూడా చేశారని, కానీ సాయంత్రం బోటు నడిపిన వారు సిమెంటు బస్తాలు తీసుకొచ్చారని.. అందుకే ప్రమాదం జరిగిందని చంద్రబాబు అన్నారు. లాంచీలో ఎన్ని సిమెంటు బస్తాలు వేశారో విచారణ చేస్తున్నామని, ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మరోవైపు గోదావరినదిలో మునిగిపోయిన లాంచీని భారీ క్రేన్ల సాయంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయటకు తీస్తున్నాయి.
 
ఇక గోదావరి లాంచీ మునక ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. రోజువారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం ఆందోళన కలిగించిందని, గుండె బరువెక్కిందని పవన్ తెలిపారు. 60 అడుగుల లోతున లాంచీ పడిపోయిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైందని.. మృతుల కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకి శాపం కావద్దు. ఈ ఘటనలో సర్కార్ శాఖలు, ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని పవన్ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments