బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. 
 
అలాగే, బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీ మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడనున్నది. దీంతో ఈనెల 12 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
ముఖ్యంగా, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని, అనంతపురం, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించింది. అలాగే, పలు జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments