Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు - రేపు భారీ వర్షాలు - చిత్తూరు జిల్లాల్లో స్కూల్స్ సెలవు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (12:30 IST)
శ్రీలంక - తమిళనాడులకు మధ్య ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడులకు సమీపంలో ఉన్న చిత్తూరులో ఈ వర్ష ప్రభావం అధికంగా వుంది. దీంతో ఆ జిల్లాలో విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు దక్షిణంగా ఈ నెల 29వ తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది క్రమంగా బలపడి పశ్చి, వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
దీంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు, ఈశాన్య భారతం నుంచి తెలంగాణా వైపు తక్కువ ఎత్తులో గాలులు వస్తుండటంతో నేడు, రేపు తెలంగాణాలో ఓ మోస్తరు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments