Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం- 9 గొర్రెలు మృతి

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (11:18 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం నగరంతోపాటు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. 
 
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దగదర్తి మండలంలో అత్యధికంగా 82.88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సంగం మండలంలో 45.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ నుండి వర్షపాతం హెచ్చరికను అనుసరించి, మొత్తం 19 మండలాల్లో ముఖ్యంగా తీర ప్రాంతాలలో అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 
 
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో పిడుగుపడి 9 గొర్రెలు మృతి చెందగా, అక్కంపేట-మనుబోలు మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
 
ఈదురు గాలులు, అలలతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కావలి, ఇందుకూరుపేట, అల్లూరు, టిపి గూడూరు, విడవలూరు, కొడవలూరు, రామాయపట్నం, కోడూరు, ముత్తుకూరు వంటి 9 తీరప్రాంత మండలాల్లోని 100 గ్రామాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. 
 
సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. వర్షాల కారణంగా సోమశిల జలాశయంలో నీటిమట్టం పెరిగింది. మరో రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments