Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీ వర్షాలు.. కృష్ణమ్మకు జలకళ.. వరదలతో ప్రజల తంటాలు

Webdunia
బుధవారం, 26 జులై 2023 (22:09 IST)
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైజాగ్ రోడ్లు చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. వాహనాలన్నీ నీట మునిగాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్‌గా పాలకులు చెప్తున్న కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం కరగ్రహారం పరిధిలోని 360 ఎకరాల లేఅవుట్ రెండు రోజుల వర్షానికే చెరువును తలపిస్తోంది. 
 
భారీ వర్షానికి విశాఖ మహానగరం అతలాకుతలమైంది. పూర్ణ మార్కెట్, స్టేడియం రోడ్డు ఇంకా నగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 
 
అలాగే భారీ వర్షాల కారణంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తి దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా దౌలేశ్వరం వద్ద గోదావరిలోకి ఇన్‌ఫ్లో 7,41,320 క్యూసెక్కులు, 10 లక్షల క్యూసెక్కులకు చేరితే మొదటి వరద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
 
భారీ వర్షాలతో హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments