Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్ ఇచ్చాడు, మత్తు మందు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్ళి అత్యాచారం చేసాడు

Webdunia
శనివారం, 31 జులై 2021 (16:04 IST)
యువతిని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డ వివాహితుడి ఉదంతం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఒక యువతి ఈ నెల 28వ తేదీన సాయంత్రం తిరుపతి నగరంలోకి రావడానికి ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఎంతసేపటికి ఆటో రాలేదు. 
 
అటువైపుగా వెళుతున్న తిరుపతి బిటిఆర్ కాలనీకి చెందిన నాగేంద్రబాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతూ యువతిని గమనించాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. నగరంలో విడిచిపెడతానని నమ్మించాడు.
 
ఆ తరువాత నగరంలోకి రాగానే కూల్‌డ్రింగ్ తాగుదామన్నాడు. నాగేంద్రబాబు నిజస్వరూపం తెలియని యువతి సరేనంది. అప్పటికే తన దగ్గర ఉన్న నిద్రమాత్రలను కూల్‌డ్రింక్‌లో కలిపి యువతికి ఇచ్చేశాడు. దీంతో ఆ యువతి డ్రింక్ తాగగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.
 
శ్రీనివాసం వసతి సముదాయాల సమీపంలో తన స్నేహితుడు నడుపుతున్న లాడ్జికి ఆ యువతిని తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు నాగేంద్రబాబు. ఆమె మేల్కొన్న తరువాత విషయం బయటకు చెబితే చంపేస్తానన్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ యువతి ఇంటికి వెళ్ళిపోయింది. 
 
అయితే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా అసలు విషయాన్ని బయటపెట్టింది. నాగేంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments