Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగలు కాజేశావు అన్నందుకు మఠంలో గొంతు కోసుకుని రోడ్డుపై నిలబడ్డాడు, ఎక్కడ?

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (23:04 IST)
హథీరాంజీ మఠం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వరస్వామితో కలిసి హథీరాంజీ పాచికలు ఆడినట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలతో పాటు తిరుపతిలోను ఎన్నో విలువైన ఆస్తులు హథీరాంజీకు ఉన్నాయి.
 
అయితే గత కొన్ని నెలలుగా హథీరాంజీమఠంకు సంబంధించిన భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. దాంతో పాటు హథీరాంజీ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన నగలు మాయమవుతున్నాయి. ప్రధానంగా తిరుమలలోని జపాలీకి చెందిన నగలు మాయమయ్యాయి.
 
నగలు మాయమైన సమయంలో అక్కడ సెక్యూరిటీగా పనిచేస్తున్న బసవరాజుపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతన్ని అప్పట్లో విచారించి వదిలేశారు. కానీ ఇప్పటికీ అతనే సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. తిరుపతిలోని హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డుగా విధులను నిర్వర్తిస్తున్నాడు బసవరాజు. 
 
అయితే ఈ రోజు సాయంత్ర మహంతు అర్జున్ దాస్ బసవరాజును గట్టిగా ప్రశ్నించడంతో కోపమొచ్చి బ్లేడుతో పీక కోసేసుకున్నాడు. రక్తపు మరకలతో రోడ్డుపైకి వచ్చి అరగంట పాటు తిరిగాడు బసవరాజు. చాలాసేపటి తరువాత బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి రుయా ఆసుప్రతిలో ప్రస్తుతం బసవరాజు చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments