Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదో ఇవ్వనంటే ఎలా.. ఈ మాట అప్పడెందుకు చెప్పలేదు : హరికృష్ణ

Webdunia
శనివారం, 28 మే 2016 (08:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని భారతీయ జనతా పార్టీ నేతలు తెగేసి చెప్పడంపై టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ స్పందించారు. సినీనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా శనివారం ఆయన కుటుంబసభ్యులు, పలువురు తెదేపా నాయకులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇపుడు ఇవ్వలేమని చెపుతున్న నేతలు.. ఇదే మాటను ఆనాడు ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న వారు, తెస్తామన్నవారు ఇప్పుడేమయ్యారని హరికృష్ణ ప్రశ్నించారు. 
 
కాగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతి కార్యకర్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ ఆశయాలను కార్యకర్తలందరూ కొనసాగించాలని సూచించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్‌లో నందమూరి హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌, తారకరత్న, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments