Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాకి ఇవే ఆఖరి ఎన్నికలు... జోస్యం చెప్పుకొచ్చిన నరసింహారావు...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (19:15 IST)
ఎవరికే వారే గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్నికల నగారా మ్రోగిన వేళ... భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు తెదేపాకి ఇవే చివరి ఎన్నికలంటూ జోస్యం చెప్పడం ప్రారంభించేసారు. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో జీవీఎల్‌ సోమవారం పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. మరో నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ భాజపా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామనీ, సామాజిక ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందనీ స్పష్టం చేసారు. భాజపా బలోపేతంతోనే జాతీయ భద్రత సాధ్యమవుతుందనీ ఆయన పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు కురిపించారు. డబ్బులు పంచి అందలాలు ఎక్కాలని తెదేపా భావిస్తోందని ఆరోపించిన ఆయన అవినీతిలో ఆ పార్టీకి గోల్డ్‌ మెడల్‌ ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. 
 
భాజపాపై విమర్శలు చేయడం.. తమ మీద పడి ఏడవడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని విమర్శించారు. జనాలు గంట గంటకు తమ ఓటు ఉందో లేదో చెక్‌ చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments