Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాకి ఇవే ఆఖరి ఎన్నికలు... జోస్యం చెప్పుకొచ్చిన నరసింహారావు...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (19:15 IST)
ఎవరికే వారే గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్నికల నగారా మ్రోగిన వేళ... భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు తెదేపాకి ఇవే చివరి ఎన్నికలంటూ జోస్యం చెప్పడం ప్రారంభించేసారు. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో జీవీఎల్‌ సోమవారం పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. మరో నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ భాజపా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామనీ, సామాజిక ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందనీ స్పష్టం చేసారు. భాజపా బలోపేతంతోనే జాతీయ భద్రత సాధ్యమవుతుందనీ ఆయన పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు కురిపించారు. డబ్బులు పంచి అందలాలు ఎక్కాలని తెదేపా భావిస్తోందని ఆరోపించిన ఆయన అవినీతిలో ఆ పార్టీకి గోల్డ్‌ మెడల్‌ ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. 
 
భాజపాపై విమర్శలు చేయడం.. తమ మీద పడి ఏడవడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని విమర్శించారు. జనాలు గంట గంటకు తమ ఓటు ఉందో లేదో చెక్‌ చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments