Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదేళ్ళ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది : ఓటర్లకు చంద్రన్న పిలుపు

ఐదేళ్ళ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది : ఓటర్లకు చంద్రన్న పిలుపు
, సోమవారం, 11 మార్చి 2019 (09:22 IST)
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓటర్లకు ఓ పిలుపునిచ్చారు. ఐదేళ్ళ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందంటూ గుర్తుచేశారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్లను పరిశీలిస్తే, 
 
* 2019 ఏప్రిల్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఓటు వేయడం మన హక్కు, ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటరు లిస్టులో తమ పేరు ఉందో లేదో చూడాలి. లేకపోతే ఫారం 6 ద్వారా వెంటనే చేర్పించుకోవాలి.
 
* ఓటు దొంగలు మీ ఓటు తొలగించకుండా కాపాడుకుంటూ, ఓటు వేసే ముందు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును, మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీతరంతో పాటు మీ బిడ్డల తరం, వారి బిడ్డల తరం వరకూ ఆలోచించి పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకు భవిష్యత్ కోసం తెరాసలో చేరనున్న సబితా ఇంద్రారెడ్డి!