Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (22:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. దాంతోపాటే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలకు కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. 
 
మరోవైపు, ఫైబర్ నెట్‌లో వైకాపాకు చెందిన 500 మందికి పైగా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చినట్టు గుర్తించిన జీవీ రెడ్డిపై వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఫైబర్ నెట్ ఎండీతో ఉన్నతాధికారులను నిలదీశారు. పైగా, ఫైబర్ నెట్‌లో గత వైకాపా ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను బహిర్గతం చేయడంతో పాటు అవినీతికి అండగా నిలబడిన ఐఏఎస్ అధికారులపై రాజద్రోహం కేసు పెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలు పెనువివాదానికి దారితీశాయి. అలాగే ఫైబర్ నెట్ ఎండీ దినేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దినేశ్ కుమార్‌ను సాధారణ పరిపాలన శాఖకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ రెండు చర్యల ద్వారా అటు పార్టీలో అయినా ఇటు ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకు ప్రాధాన్యం అనే బలమైన సంకేతాలను పంపించినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments