Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా మాచర్ల ఎమ్మెల్యే కారుపై దాడి...

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (14:27 IST)
అమరావతి రాజధాని కోసం గత 21 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా, రాజధాని కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు గత 21 రోజులుగా రోడ్లపైకి వచ్చిన వివిధ రకాల నిరసనలు, ర్యాలీలు, మౌన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా చినకాకాని వద్ద అధికార పార్టీ వైకాపాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. 
 
కాగా, రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తోన్న ఆందోళనల్లో భాగంగా చినకాకాని వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. రైతుల నిరసనలతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, మంత్రుల వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. 
 
ఆ సమయంలో అటుగా మాచర్ల ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి కారు వచ్చింది. ఆ కారును ఆపేందుకు రైతులు ప్రయత్నించారు. కానీ, ఆయన ఆపకుండా ముందుకు సాగిపోయారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత పోలీసులు, గన్‌మెన్లు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే కారును ఆందోళనకారుల చెర నుంచి విడిపించడంతో వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments