Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంశోద్ధారకుడి కోసం చావని ఆశ... ప్రాణం తీసిన ప్రసవం

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (14:25 IST)
ఓ మాతృమూర్తి ఆశ అడియాశలై పోయింది. వంశోద్ధారకుడు ఉంటేనే పున్నామనరకం నుంచి తప్పిస్తాడనే వెర్రి ఆశ ఓ మాతృమూర్తి ప్రాణం తీసింది. ఫలితంగా ఆరుగురు ఆడబిడ్డలు అనాథలుగా మారారు. 
 
ఒకరిద్దరూ బిడ్డలను పెంచి పోషించేందుకే అష్టకష్టాలు పడుతున్న ఈ రోజుల్లో మగపిల్లాడు పుట్టాలనే ఆశతో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఈ ఆరు కాన్పులతో ఆమె శక్తి హరించుకునిపోయింది. అయినప్పటికీ.. వంశోద్ధారకుడు కోసం ఆశ చావని ఆ తల్లి ఆరో కాన్పులోనైనా పుడతాడని ఆశపడింది. అయితే, అదే ఆమెకు చివరి కాన్పు అవుతుందని ఊహించలేక పోయింది. మరో ఆడబిడ్డకు జన్మనిచ్చి అసువులు బాసింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా గురజాలలో జరిగింది. 
 
స్థానిక దళితవాడకు చెందిన చిలుకూరి మేరీ సునీత అనే 26 యేళ్ళ మహిళ కూలీనాలి చేసుకుంటూ జీవిస్తోంది. ఈమె భర్త రిక్షాకార్మికుడు. వీరికి పదేళ్ళ క్రితం వివాహం కాగా ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. కానీ వంశోద్ధారకుడుకి కోసం ఆ దంపతులు పరితపించారు. తనలోని శక్తి హరించుకుని పోయినా ఆ తల్లి ఆరో కాన్పుకు సిద్ధపడింది. కానీ అదే చివరి కాన్పు అవుతుందని ఆమె గ్రహించలేక పోయింది. ఆరో కాన్పులో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మేరీ సునీత కన్నుమూసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments