Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (11:13 IST)
గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన తాజా వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం మేరకు.. ఆగస్టు 27వ తేదీన 14 యేళ్ల బాలిక రాత్రి 7 గంటల సమయంలో ఇంటి బయటకు వెళ్లి ఆ తర్వాత మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. 
 
దీంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి ఆ బాలిక ఆచూకీని తెలుసుకున్నారు. ఆ బాలికను నాని అనే యువకుడు అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. 27వ తేదీన బాలికను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నాని అక్కడ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను ఇంటి సమీపంలో రాత్రిపూట వదిలి వెళ్లిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ బాలికను చేరదీసి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి వద్ద పోలీసులు జరిపిన విచారణలో వెల్లడించింది. దీంతో నాని, జగన్మోహన్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments