Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (11:13 IST)
గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన తాజా వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం మేరకు.. ఆగస్టు 27వ తేదీన 14 యేళ్ల బాలిక రాత్రి 7 గంటల సమయంలో ఇంటి బయటకు వెళ్లి ఆ తర్వాత మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. 
 
దీంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి ఆ బాలిక ఆచూకీని తెలుసుకున్నారు. ఆ బాలికను నాని అనే యువకుడు అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. 27వ తేదీన బాలికను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నాని అక్కడ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను ఇంటి సమీపంలో రాత్రిపూట వదిలి వెళ్లిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ బాలికను చేరదీసి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి వద్ద పోలీసులు జరిపిన విచారణలో వెల్లడించింది. దీంతో నాని, జగన్మోహన్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments