Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో రసవత్తరంగా రాజకీయాలు.. కలాం టవర్‌గా మార్చాలంటూ...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:43 IST)
గుంటూరులోని జిన్నా టవర్ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ టవర్‌పై ఉన్న జాతీయ జెండాను గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తొలగించారు. దీంతో జిల్లా కేంద్రమైన గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
కాగా, జిన్నా టవర్‌ పేరును మార్చాలంటూ గత కొన్ని రోజులుగా బీజేపీ ఏపీ శాఖ శ్రేణులు, నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ టవర్‌కు అబ్దుల్ కలాం టవర్‌గా పేరు పెట్టాలంటూ వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వివాదం ముదరడంతో కార్పొరేషన్ అధికారులు జిన్నా టవర్‌కు జాతీయ రంగులు వేయించారు. అక్కడే జెండా దిమ్మను ఏర్పాటు చేసి జాతీయ జెండాను సైతం ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రితో సహా పలువురు నేతలు హాజరయ్యారు. 
 
ఇపుడు దిమ్మెతో ఉన్న జాతీయ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం చరీ్చనీయాంశంగా మారింది. జిన్నా టవర్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందంటూ పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments