Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకలూరి పేటలో తొలి కరోనా... వైద్యురాలికి సోకిన వైరస్

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (18:47 IST)
గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా నివసిస్తూ నరసారావు పేటలో వైద్య సేవలు అందిస్తూ వచ్చిన ఓ వైద్యురాలికి ఈ వైరస్ సోకింది. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా, ఆమె వైద్య చేసిన వారి గుబులు మొదలైంది. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె వైద్యం చేసిన రోగులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 
 
చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళ స్థానికంగా నివసిస్తూ నరసారావు పేటలో వైద్యురాలిగా పని చేస్తోంది. ఈమె గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చింది. దీంతో ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఇది చిలకలూరిపేటలో తొలి కరోనా కేసు నమోదైంది. 
 
స్థానికంగా నివసిస్తూ నరసరావుపేటలో పనిచేస్తున్న వైద్యురాలికి పాజిటివ్ అని తేలడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఆమె కుటుంబ సభ్యులకు మాత్రం నెగటివ్ రిపోర్టులు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. 
 
మరోవైపు, జిల్లాలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నేడు కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 177కు పెరిగినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. బుధవారం గుంటూరులో 5, నరసరావుపేటలో 5, దాచేపల్లిలో 4, చిలకలూరిపేటలో ఒక కేసు నమోదైంది. తాజా కేసులతో కలుపుకుని ఒక్క గుంటూరు నగరంలోనే నమోదైన కేసుల సంఖ్య 106కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments