Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సమయంలో కల్వరి సేవలు అమోఘం: ఎమ్మెల్యే కిలారి

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (13:29 IST)
పశువుల పాకలో జన్మించి లోకానికే ఆరాధ్యుడైన దయామయుడు, ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటిన కారుణామయుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్టమస్ అంటూ, రాష్ట్ర ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. 

 
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండల పరిధిలోని నంబూరు గ్రామంలో కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ముఖ్య అతిథిగా పాలుపంచుకుని ప్రసంగించారు. దేవుని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నకల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు సతీష్ సందేశం అద్భుతమన్నారు. ఆయన వాక్యం వినటం కోసం వివిధ జిల్లాల నుంచి వేలాదిమంది తరలి రావటం సామాన్యమైన విషయం కాదన్నారు. 
 
 
కరోనా కష్టకాలంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కల్వరి టెంపుల్ అందించిన సేవలు అమోఘం, అభినందనీయమని కొనియాడారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తూ, మరొక్కసారి వేదికపై నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments