Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమరావతి రైతుల మహోద్యమ ముగింపు సభ

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:47 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన మహోద్యమ పాదయాత్ర ముగింపు బహిరంగ సభ శుక్రవారం తిరుపతిలో జరుగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో వారు ఏకధాటిగా 44 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర చివరి అంకంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఇప్పటికే ఆ ప్రాంత రైతులు, మహిళలు ఈ పాదయాత్రలో భాగస్వామ్యులైన విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రైతుల సంఘాల సమాఖ్య ఐకాస నేతలు వెల్లడించారు. ఈ బహిరంగ సభ తిరుపతి పరిధిలోని దామినీడు అనే ప్రాంతంలో జరుగనున్నాయి. 
 
ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో భారీగానే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు హాజరుకానున్నారు. కాగా, ఈ సభ సాయంత్రం 6 గంటలకు ముగించాలని హైకోర్టు షరతు విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments