Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమరావతి రైతుల మహోద్యమ ముగింపు సభ

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:47 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన మహోద్యమ పాదయాత్ర ముగింపు బహిరంగ సభ శుక్రవారం తిరుపతిలో జరుగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో వారు ఏకధాటిగా 44 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర చివరి అంకంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఇప్పటికే ఆ ప్రాంత రైతులు, మహిళలు ఈ పాదయాత్రలో భాగస్వామ్యులైన విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రైతుల సంఘాల సమాఖ్య ఐకాస నేతలు వెల్లడించారు. ఈ బహిరంగ సభ తిరుపతి పరిధిలోని దామినీడు అనే ప్రాంతంలో జరుగనున్నాయి. 
 
ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో భారీగానే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు హాజరుకానున్నారు. కాగా, ఈ సభ సాయంత్రం 6 గంటలకు ముగించాలని హైకోర్టు షరతు విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments