Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుడు పోసుకున్న వెంటనే ఆధార్ - ఆస్పత్రుల్లోనే జారీ

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:36 IST)
దేశ పౌరుందరికీ ఆధార్ నంబరును కేంద్రం కేటాయిస్తుంది. ఇపుడు ప్రతి ఒక్కదానికి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తున్నారు. పిల్లల చదువులకే కాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకం పొందేందుకు, బ్యాంకు ఖాతా తెరిచేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ నంబరు తప్పనిసరి అయింది. 
 
దీంతో ఇకపై పుట్టిన వెంటనే ఆధార్ నంబరును జారీచేసేందుకు కేంద్రం సన్నాహాలు చేపట్టింది. ఈ నంబరును ఆస్పత్రుల్లోనే జారీ చేసేలా చర్యలు తీసుకోనుంది. ఇదే అంశంపై రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగం అధికారులతో చర్చలు జరుపుతోంది. 
 
నిజానికి ఐదేళ్ళలోపు చిన్నారులకు బయోమెట్రిక్ లేదు. అందువల్ల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఆధార్ కార్డుతో దానిని అనుసంధానిస్తారు. ఐదేళ్ళ తర్వాత ఆ చిన్నారి బయోమెట్రిక్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 99.7 శాతం మంది (137 కోట్లు)కి ఆధార్ కార్డులు జారీచేసిటన్టు చెప్పారు. ప్రతి యేడాది రెండు నుంచి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని, వారికి పుట్టిన వెంటనే ఆధార్ నంబరును జారీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఆధార్ సంస్థ సీఈవో సౌరభ్ గార్గ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం