Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీమార్ట్‌లో జనసైనికుల చోరీ చేసినట్టు దుష్ప్రచారం...

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:44 IST)
గుంటూరులోని ప్రముఖ సూపర్ మార్కెట్ డిమార్ట్‌లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు (జనసైనికులు) చోరీ చేసినట్టు దుష్ప్రచారం సాగుతోంది. దీనిపై గంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు స్పందించారు. డిమార్ట్ షోరూమ్‌లో జనసైనికులు చోరీ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుందన్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు. కేవలం జనసేనను భ్రష్టుపట్టించేందుకు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం సాగుతోందన్నారు. తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 
 
కాగా, గుంటూరు పట్టణంలోని నాజ్ సెంటరులో డిమార్ట్ యాజమాన్యంతో తాము మాట్లాడామని, వారు కూడా అలాంటిదేమీ జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. తమ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై భవిష్యత్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments