Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీమార్ట్‌లో జనసైనికుల చోరీ చేసినట్టు దుష్ప్రచారం...

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:44 IST)
గుంటూరులోని ప్రముఖ సూపర్ మార్కెట్ డిమార్ట్‌లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు (జనసైనికులు) చోరీ చేసినట్టు దుష్ప్రచారం సాగుతోంది. దీనిపై గంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు స్పందించారు. డిమార్ట్ షోరూమ్‌లో జనసైనికులు చోరీ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుందన్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు. కేవలం జనసేనను భ్రష్టుపట్టించేందుకు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం సాగుతోందన్నారు. తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 
 
కాగా, గుంటూరు పట్టణంలోని నాజ్ సెంటరులో డిమార్ట్ యాజమాన్యంతో తాము మాట్లాడామని, వారు కూడా అలాంటిదేమీ జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. తమ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై భవిష్యత్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments