Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురజాలలో దారుణం... రైతుపై దుండగుల దాడి.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:50 IST)
గుంటూరు జిల్లా గురజాలలో దారుణం చోటుచేసుకుంది. తుమ్మలచెరువుకు చెందిన సైదాబి అనే రైతుపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. పొలం దారి విషయంలో ఈ దాడి జరిగిందని బాధితుడైన రైతు కుమారుడు జిలానీ చెప్పారు.  
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల తుమ్మల చెరువు లోట్ ప్లాజా వద్ద ఓ వ్యక్తిపై అత్యంత దారుణంగా దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వ్యక్తిని రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు వ్యక్తులు, కాళ్లు, చేతులు పట్టుకోగా మరో వ్యక్తి బండరాయి కొడుతున్నాడు. బాధితుడు నొప్పితట్టుకోలేక కేకలు పెట్టాడు.
 
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదాబి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల శివారులో ప్రత్యర్థులు శివారెడ్డి, హేమంత్‌రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అన్నపురెడ్డి, నరసరావుపేటకు చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. పొలంగట్ల వివాదంతో ఈ దాడి జరిగిందని బాధితుడు తెలిపాడు.
 
ఇనుప రాడ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వ్యక్తిని సైదాబిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో బాధితుడిని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments