Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకు ఆర్ఎంపీ వైద్యుడు.. కోడికూర వండలేదని.. కన్నతల్లినే హతమార్చాడు..

క్షణికావేశంతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన ఓ కుమారుడు.. ఏకంగా కన్నతల్లినే హతమార్చాడు. చికెన్ వండలేదని కన్నతల్లినే హతమార్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (17:29 IST)
క్షణికావేశంతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన ఓ కుమారుడు.. ఏకంగా కన్నతల్లినే హతమార్చాడు. చికెన్ వండలేదని కన్నతల్లినే హతమార్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
బాగా మద్యం తాగి ఇంటికొచ్చిన కిషోర్ అనే వ్యక్తి తన తల్లి మరియమ్మ (60) ని అన్నం పెట్టమన్నాడు. అయితే, చికెన్ కూర వండలేదని తెలుసుకున్న కిశోర్‌.. ఆగ్రహంతో ఊగిపోయి కత్తితో కన్నతల్లిని పొడిచి హత్య చేశాడు. 
 
నిందితుడు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడని, ఆస్తి విషయంలోనూ కొన్ని రోజులుగా తల్లితో గొడవ పడుతున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. కిశోర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆస్తి విషయంలో మరియమ్మ కిషోర్‌కు వత్తాసు పలకలేదనేది కూడా ఈ  హత్యకు కారణమై వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments