Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మహానటి' కోసం ఎంతో చేశాను.. కనీసం థ్యాంక్స్ కార్డు కూడా వేయలేదు : సంజయ్ కిషోర్

'మ‌హాన‌టి' సినిమా తెలుగు, త‌మిళంలో రిలీజై విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో రికార్డు స్థాయి వసూళ్ళను రాబడుతోంది. బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోన్న ఈ టైమ్‌లో అస‌లు.. బ‌యోపిక్ అంటే ఇలా ఉండాలి అనేలా మ‌హాన‌టి చిత్రాన

Advertiesment
Mahanati
, ఆదివారం, 27 మే 2018 (15:15 IST)
'మ‌హాన‌టి' సినిమా తెలుగు, త‌మిళంలో రిలీజై విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో రికార్డు స్థాయి వసూళ్ళను రాబడుతోంది. బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోన్న ఈ టైమ్‌లో అస‌లు.. బ‌యోపిక్ అంటే ఇలా ఉండాలి అనేలా మ‌హాన‌టి చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే... ఈ సినిమా ఇంత అద్భుతంగా రావ‌డానికి తెర వెన‌ుక ఎంతో మంది కృషి ఉంది. సావిత్రి గారి వీరాభిమానిగా.. ఆమె పేరుతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన సినీ ప్రేమికుడు సంజయ్ కిషోర్.
 
ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సావిత్రికి సంబంధించి ఎవరు ఎలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించినా, అందుకు సంబంధించిన సమాచారం విషయంలో నా పేరు ప్రస్తావనకు వస్తుంటుంది. దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటు ఆయన టీమ్ సభ్యులు వచ్చి నన్ను కలుసుకున్నారు. ఆమెకి సంబంధించి నా దగ్గరున్న మెటీరియల్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 
 
వాళ్లకి కావలసినవి తీసుకుని వెళ్లారు. నేను సంపాదించడానికే ఎన్నో యేళ్లు పట్టింది. ఇంత కష్టపడి సేకరించిన మెటీరియల్‌తో వాళ్లకి సహకరిస్తే కనీసం థ్యాంక్స్ కార్డు కూడా వేయలేదు. ఆర్థికంగా నేనేం ఆశించలేదు. థ్యాంక్స్ కార్డు వేసుంటే హ్యాపీగా వుండేది. ఏదిఏమైనా... వాళ్ల ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను అని చెప్పారు. మ‌రి... సంజ‌య్ కిషోర్ కామెంట్‌పై మ‌హాన‌టి టీమ్ స్పందిస్తుందేమో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య - బోయ‌పాటి సినిమాని నిర్మించేది ఎవ‌రో తెలుసా..?