Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపల్లెలో జవాను కాల్పుల కలకలం.. రేప్ కేసు పెట్టిందనీ...

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (15:09 IST)
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో కాల్పుల కలకలం. ప్రేమించి మోసం చేసినందుకు రేప్ కేసు పెట్టిందన్న అక్కసుతో యువతి, ఆమె తల్లిపై ఓ ఆర్మీ జవాన్ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ తల్లీబిడ్డను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నడుంపల్లి గ్రామానికి చెందిన మురాల రమాదేవి, ఆమె కుమార్తె నాగజ్యోతి ప్రేమకు నిరాకరించిందని కారణంతో నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన ఏమినేని బాలాజీ కాల్పులు జరిపాడు. ఆర్మీలో పని చేస్తూ వివాహం చేసుకుంటానని నాగజ్యోతిని మోసం చేశాడు. 
 
పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో గత డిసెంబర్లో బాపట్ల పట్టణ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. నాగజ్యోతి రేప్ కేసు పెట్టడంతో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన బాలాజీ శుక్రవారం అర్థరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత రివాల్వర్, మరణాయుధాలతో రమాదేవి ఇంటికి వచ్చి తల్లి, కుమార్తెపై కాల్పులు జరిపాడు. రమాదేవికి చెవి దగ్గర గాయమైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments