Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటిన ఆరో తరగతి విద్యార్థిని

Webdunia
సోమవారం, 8 మే 2023 (11:21 IST)
ఏపీలో గత శనివారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయాయి. ఈ పరీక్షాల్లో ఆరో తరగతి అమ్మాయి సత్తా చాటింది. ఆరో తరగతి బాలిక పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 566 మార్కులు సాధించి, శభాష్ అనిపించుకుంది. ఆ బాలిక బేరు చిర్రా అనఘాలక్ష్మి. గుంటూరు పట్ణం. స్థానికంగా ఉండే బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి విష్ణువర్థన్ రెడ్డి. మంగళగిరి భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగి కాగా, తల్లి సత్యదేవి ఎమ్మెస్సీ బీఈడీ పూర్తిచేశారు. 
 
తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే అబాకస్, వేదిక్ మ్యాథ్స్‌లలో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అనఘా లక్ష్మి... గణిత అవధానాల్లో శతావధాన స్థాయికి చేరుకున్నారు. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బాలిక ప్రతిభకు ముగ్ధుడైన మంత్రి ఆదిమూలపు సురేష్.. ఆ బాలికతో పదో తరగతి పరీక్షలు రాయించాలని సూచించారు. 
 
ఆ తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో ఇటీవల ఇతర విద్యార్థులతో కలిసి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైంది. శనివారం విడుదలైన ఈ ఫలితాల్లో ఆ బాలిక 600కు గాను 566 మార్కులు సాధించి తన సత్తా చాటింది. అలాగే కాకినాడకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని ముప్పల హేమశ్రీ కూడా పదో తరగతి పరీక్షలు రాసి 488 మార్కులు సాధించి అందరితో శభాష్ అనిపించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments