Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఆర్ఎం విద్యార్థినికి గిన్నిస్ రికార్డ్ టైటిల్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (06:11 IST)
ఏపీ ఎస్ఆర్ఎం విశ్వ విద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థిని గారిపల్లి వైష్ణవి ప్రతిష్టాత్మక మైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ను సొంతం చేసుకుంది.  
 
సైబర్ సెక్యూరిటీలో తొలిసారి బ్లాక్ చైన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించినందుకు గానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ దక్కినట్లు వైష్ణవి పేర్కొంది.  
 
ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఎదురవుతోన్న తాజా సవాళ్లపై  అక్టోబరు 30 న జరిగిన అంతర్జాతీయ సదస్సులో  తన పరిశోధన పత్రం ప్రచురణకు నోచుకున్నట్లు వివరించింది. 
 
వైష్ణవి అభివృద్ధి చేసిన యాప్ వల్ల కంప్యూటర్ లో ముఖ్యమైన డేటా చోరీకి గురయ్యే అవకాశం లేదు. అంతే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలపై సైబర్ ఎటాక్ జరిగే అవకాశం తక్కువ. దీన్ని గుర్తిఃచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కమిటీ వైష్ణవి ప్రతిభను ప్రశంసిస్తూ గిన్నిస్ సర్టిఫికెట్ ను ప్రధానం చేసింది.  

బ్లాక్ చైన్ టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించడం, అభివృద్ధి చేయడం వల్ల అత్యంత ముఖ్యమైన కంప్యూటర్ సమాచారానికి పూర్తి రక్షణ ఏర్పడుతుందని వైష్ణవి పేర్కొంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థిని వైష్ణవి ని ప్రత్యేకంగా అభినందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments