50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (17:41 IST)
నీటి వివాదాల్లో నెలకొన్న అంశాలపై తెలంగాణ తరుపున వాదనలు గట్టిగా వినిపిస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరి రజత్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని గుర్తు చేశారు. న్యాయమైన వాటా కోసం సమావేశంలో ప్రశ్నిస్తామన్నారు. 
 
ఏపీ తరలిస్తున్న నీటిపై ముందు నుంచి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టు అని సమావేశంలో గట్టిగా చెప్పనుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50శాతం ఇవ్వాల్సిందే రజత్ కుమార్ స్పష్టం చేశారు.
 
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నీటి పంపకాలపై మీటింగ్ కొనసాగుతుంది. ఈ మీటింగ్‌కు రెండు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సహా వివాదాస్పదంగా ఉన్న పలు అంశాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఓ కొలిక్కి వస్తాయా లేక మళ్లీ పంచాయితీ కేంద్రం వద్దకు వెళ్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. 
 
బోర్డు పరిధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం వాడివేడిగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులను మాత్రమే పూర్తిగా బోర్డు పరిధిలో ఉంచితే సరిపోతుందని, అన్ని ప్రాజెక్టులు అవసరం లేదని ఏపీ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. తెలంగాణ కూడా దీనిపై వివరంగా చర్చించింది. 
 
తన అభిప్రాయాన్ని బోర్డు సమావేశంలో చెప్పడంతోపాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. నీటి వాటాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments