Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గం నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం బర్తరఫ్

ఠాగూర్
బుధవారం, 6 మార్చి 2024 (07:39 IST)
అందరూ ఊహించిందే జరిగింది. ఏపీలో అధికార వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంను ఏపీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీచేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి.. మంత్రి జయరాంకు సూచించారు. కానీ, ఈ ప్రతిపాదన పట్ల మంత్రి జయరాం తీవ్ర అసంతృప్తితో కొనసాగుతూ, గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 
 
అదేసమయంలో టీడీపీలో చేరేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేశారు. ఇవి ఫలించడంతో పసుపు కండువా కప్పుకున్నారు. మంగళవారం మంగళగిరి వేదికగా జరిగిన బీసీ సభలో ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి జయరాంను బర్తరఫ్ చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు చేశారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments