Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (20:32 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరోనా బారినపడి మరణించినవారి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు వారి కుటుంబ సభ్యులకు అందించబడతాయని డియంహెచ్ఓ డా.యం.సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు.
 
 కరోనా మూలంగా మరణించినట్లు సంబంధిత వైద్యుని ధృవీకరణ పిమ్మట వారి కుటుంబ సభ్యుల నామిని దారులకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేయబడుతుందన్నారు.  దీనికిగాను వైద్యుడు ధ్రువీకరించిన మరణ ధ్రువీకరణ పత్రం,తహసీల్దార్ చే ధృవీకరించబడి  మంజూరు చేయబడిన కుటుంబ సభ్యుల పత్రం తప్పనిసరి.
 
పై ధ్రువీకరణ పత్రాలను సంబంధిత సచివాలయ, ఆరోగ్య కార్యకర్తల ద్వారా సంబంధిత పి హెచ్ సి వైద్యాధికారి వారికి అందజేయాలన్నారు. వారి యొక్క బ్యాంకు ఖాతా నెంబరు ఐఎఫ్ఎస్ సి కోడ్ బ్యాంక్ పేరు మరియు బ్రాంచ్ వివరాలను జతపరిచి అందజేయాల్సి వుందన్నారు.

ఈ విధంగా సమర్పించిన పత్రాలను సంబంధిత అధికారులు పరిశీలించి అర్హులైన వారి ఖాతాలోకి 15 వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు. కావున బాధిత కుటుంబ సభ్యులు పైన పేర్కొన్న వివరములను గమనించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని  తెలియజేశారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments