Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ జాబ్ హేమావతి, ప్రభుత్వం ఇచ్చిన రివార్డ్ డబ్బు పేదలకే

Webdunia
బుధవారం, 26 మే 2021 (19:12 IST)
రివార్డ్ ప్రకటించి డబ్బులు వస్తే ఏం చేస్తాం? వ్యక్తిగత అవసరాలకు వాడేసుకుంటాం. అది మామూలే. కానీ తిరుపతికి చెందిన వాలంటీర్ మాత్రం తనకు రివార్డ్ వచ్చినా సరే ఆ డబ్బును ఖర్చుపెట్టలేదు. నిరాశ్రయులు, అనాథలు, ప్రత్యేక ప్రతిభావంతులు నివాసముండే అక్షయక్షేత్రానికి ఆ డబ్బులను ఇచ్చేసింది. అంతేకాదు సేవామిత్ర పురస్కారాన్ని అందుకుని అందరి మన్ననలను అందుకుంటోంది.
 
తిరుపతి 8వ డివిజన్‌కు చెందిన వాలంటీర్ హేమావతిని నగర పాలకసంస్థ కమిషనర్ గిరీషా అభినందించారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్ గుప్త పంపిన అభినందన పత్రాన్ని కమిషనర్ అందజేశారు. మానవతా విలువలతో క్రమశిక్షణ, నిజాయితీగా ఉండి సంక్షేమ పథకాల పంపిణీలో చురుగ్గా వ్యవహరించారు హేమావతి. దీంతో హేమావతికి సేవామిత్ర పురస్కారాన్ని ప్రభుత్వం అందజేస్తూ 10 వేల రూపాయల నగదును ఇచ్చింది.
 
అయితే ఆ డబ్బును స్వంత అవసరాలకు హేమావతి ఉపయోగించకుండా అక్షయక్షేత్రానికి అందించారు. అక్షయక్షేత్రంలో తలదాచుకుంటున్న అభాగ్యులు, అనాధలు, ప్రత్యేక ప్రతిభావంతులకు స్వయంగా భోజనం చేసిపెట్టడంతో పాటు వారికి మాస్కులు, శానిటైజర్లను అందించింది హేమావతి. దీంతో వాలంటీర్ హేమావతిని అభినందించారు నగరపాలకసంస్ధ కమిషనర్ గిరీషాతో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments