Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు కాలి నడకన వెళుతున్నారా? జాగ్రత్త దొంగలు వెనకే వస్తున్నారు

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (22:44 IST)
తిరుమల నడకదారిలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. అలిపిరి నడకదారిలో కర్నూలుకు చెందిన భక్తులపై దొంగలు దోపిడీకి యత్నించారు. భక్తులు ప్రతిఘటించడంతో దొంగలు పారిపోయారు. 
 
నిన్న సాయంత్రం చీకటి పడే సమయానికి అలిపిరి మార్గం నుంచి కర్నూలుకు చెందిన భక్త బృందం తిరుమలకు బయలుదేరింది. చిన్నపిల్లలతో పాటు మొత్తం 9 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
నడిచి వస్తుండగా సరిగ్గా నడకదారికి సగభాగంలో నలుగురు యువకులు కనిపించారు. వారు వీరి వెనుకలే వస్తూ టార్చ్ లైట్ వారి ముఖంపై వేస్తూ హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తరువాత చిన్నపిల్లల మెడలో ఉన్న బంగారు చైన్లను లాక్కునేందుకు ప్రయత్నించారు.
 
దీంతో భక్తబృందంలోని ముగ్గురు మగవారు దొంగలతో ప్రతిఘటించడంతో పాటు వారితో పాటు ఉన్న వారు గట్టిగా కేకలు వేయడంతో దగ్గరలో నడిచివస్తున్న కొంతమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. భక్త బృందం ఎక్కువగా వస్తుండడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
 
అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. అయితే మోకాళ్ళ మిట్ట వద్దకు వెళ్ళిన తరువాత టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మొబైల్ వ్యాన్‌లో ఘటనా స్థలి వద్దకు వెళ్ళారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments