Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు కాలి నడకన వెళుతున్నారా? జాగ్రత్త దొంగలు వెనకే వస్తున్నారు

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (22:44 IST)
తిరుమల నడకదారిలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. అలిపిరి నడకదారిలో కర్నూలుకు చెందిన భక్తులపై దొంగలు దోపిడీకి యత్నించారు. భక్తులు ప్రతిఘటించడంతో దొంగలు పారిపోయారు. 
 
నిన్న సాయంత్రం చీకటి పడే సమయానికి అలిపిరి మార్గం నుంచి కర్నూలుకు చెందిన భక్త బృందం తిరుమలకు బయలుదేరింది. చిన్నపిల్లలతో పాటు మొత్తం 9 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
నడిచి వస్తుండగా సరిగ్గా నడకదారికి సగభాగంలో నలుగురు యువకులు కనిపించారు. వారు వీరి వెనుకలే వస్తూ టార్చ్ లైట్ వారి ముఖంపై వేస్తూ హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తరువాత చిన్నపిల్లల మెడలో ఉన్న బంగారు చైన్లను లాక్కునేందుకు ప్రయత్నించారు.
 
దీంతో భక్తబృందంలోని ముగ్గురు మగవారు దొంగలతో ప్రతిఘటించడంతో పాటు వారితో పాటు ఉన్న వారు గట్టిగా కేకలు వేయడంతో దగ్గరలో నడిచివస్తున్న కొంతమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. భక్త బృందం ఎక్కువగా వస్తుండడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
 
అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. అయితే మోకాళ్ళ మిట్ట వద్దకు వెళ్ళిన తరువాత టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మొబైల్ వ్యాన్‌లో ఘటనా స్థలి వద్దకు వెళ్ళారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments