Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీబీనగర్ వద్ద వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (08:38 IST)
విశాఖపట్టణం - హైదరాబాదా ప్రాంతాల మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్  బీబీనగర్ వద్ద ఈ ప్రమాదం బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రయాణికులు ఎవరూ కూడా గాయపడలేదు. ఈ ఘటనలో మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులంతా సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, రైలు పట్టాలు తప్పడం కారణంగా వచ్చిన భారీ శబ్దానికి ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ ప్రమాదం కారణంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ అక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తున్నారు. కాగా, పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళుతుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్షణం స్పందించి హెల్ప్ లైన్ నంబరు 040-2778 6666 ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments