Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీబీనగర్ వద్ద వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (08:38 IST)
విశాఖపట్టణం - హైదరాబాదా ప్రాంతాల మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్  బీబీనగర్ వద్ద ఈ ప్రమాదం బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రయాణికులు ఎవరూ కూడా గాయపడలేదు. ఈ ఘటనలో మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులంతా సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, రైలు పట్టాలు తప్పడం కారణంగా వచ్చిన భారీ శబ్దానికి ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ ప్రమాదం కారణంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ అక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తున్నారు. కాగా, పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళుతుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్షణం స్పందించి హెల్ప్ లైన్ నంబరు 040-2778 6666 ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments