పెళ్లి చేసుకుంటా అని లాడ్జికి పిలిచి.. బాలికపై లైంగిక దాడి

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (10:46 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటా అని పిలిచి ఓ యువకుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ద్వారకా తిరుమల ఎస్ఐ టి.వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం… పంగిడిగూడెం కు చెందిన పదిహేనేళ్ల బాలిక తో నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఏడాదికాలంగా ప్రేమిస్తున్నా అని చెప్పి బాలికను బుట్టలో వేసుకున్నాడు.
 
ఇక ఈ నెల 19వ తేదీన పెళ్లి చేసుకుంటానని ద్వారకా తిరుమలకు బాలికను తీసుకు వెళ్ళాడు. అక్కడ ఓ లాడ్జి తీసుకుని బాలిక పై అత్యాచారం చేసి అనంతరం బస్టాండ్ లో వదిలిపెట్టాడు. తరవాత తనకు పెళ్లి అయిందని చెప్పి బాలికను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు.
 
దాంతో బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు యువకుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం