Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠ‌శాల నుంచి బాలిక కిడ్నాప్... అత్యాచారానికి తీసుకెళ్ళి...

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (14:30 IST)
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో పాఠశాలకు వెళ్లిన బాలికను దారి మ‌ళ్లించి అత్యాచారానికి య‌త్నించిన ఉదంత‌మిది. ఈ అగంతుకుడు రాకేష్ పాఠ‌శాల‌కు వెళ్లి వాళ్ళ అమ్మ రమ్మంటుందని చెప్పి, స్కూల్ టీచర్ పర్మిషన్ తీసుకుని బాలిక‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించాడు. అనంత‌రం అత్యాచారం చేయడానికి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి బాలివ‌క‌ను బండి మీద ఎక్కించుకుని సుమారు 2 కిలోమీటర్లు తీసుకు వెళ్ళాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, బాలిక భయపడి గట్టిగా అరచి కేకలు వేయడంతో, నిందితుడు రాకేష్ కూడా భయ పది ఆ బాలికను తిరిగి స్కూలుకు తీసుకు వచ్చి వదిలి వెళ్ళిపోయాడు. బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో పెదవేగి పోలీసులకు పిర్యాదు చేసారు.
 
 ఈ అఘాయిత్యానికి పాల్పడిన  రాకేష్ కి సహకరించి, ఒక రాజకీయ నాయకుడు  మైనర్ బాలికకు నిందితుడు నుండి 10 వేలు నష్ట పరిహారం ఇప్పించడానికి కేసు లేకుండా రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. దీనిపై పెద వేగి ఎస్ ఐ సుధీర్ ను వివరణ కోరగా, రాకేష్ అనే వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి భయపడి బాలికను క్షేమంగా పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకు వచ్చి దింపి వెళ్లిపోయాడని విచారణలో తెలిసిందని చెప్పారు. నిందితుడు రాకేష్ పై కేసు నమోదు చేశామని ఎస్ ఐ సుధీర్ గురువారం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments