Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెలిపై పలుమార్లు అత్యాచారం.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (11:44 IST)
మహిళలపై అకృత్యాలు అమాంతం పెరిగిపోతున్నాయి. వావివరుసలు లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ కామాంధుడు చెల్లెలిపైనే తన కామ వాంఛను తీర్చుకున్నాడు. ఈ అకృత్యం కారణంగా బాలిక గర్భం దాల్చింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఈ ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (13)పై.. ఆమె పెద్దమ్మ కొడుకు (20) పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మైనర్ బాలిక గర్భం దాల్చింది. 
 
బాలిక గర్భం దాల్చిన ఆర్నెళ్ల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే గర్భస్రావం చేయించే అవకాశం కూడా లేకపోవడంతో.. బాలికను ఐసీడీఎస్ సంరక్షణలో ఉంచారు. బాలికకు తొమ్మిది నెలలు నిండటంతో బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ చేయగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments