Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరంలో హీటెక్కిన రాజకీయాలు - టీడీపీ ఎమ్మెల్యేకు భద్రత పెంపు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (08:02 IST)
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా నేతల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫలితంగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాకు మద్దతిస్తున్న వల్లభనేని వంశీ మోహన్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను పెంచింది. 
 
ఆయనకు ఇప్పటివరకు ఇస్తూ వస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్ళ భద్రతను ఇపుడు ఏకంగా 25 మందికి పెంచారు. దీనికి కారణం లేకపోలేదు. వల్లభనేని వంశీమోహన్‌ని వైకాపా నేతలు యార్లగడ్డ వెంకట్‌రావు, దుట్టా రామచంద్రరావు టార్గెట్‌ చేయడమే. 
 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ టిక్కెట్‌పై యార్లగడ్డ, రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. దీంతో ముగ్గురు నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫలితంగా వారి అనుచరులు కూడా గ్రూపులుగా విడిపోయారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.
 
మరోవైపు ప్రభుత్వం చేపట్టిన "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమలో వల్లభనేని వంశీమోహన్‌ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆయనకు గతంలో ఇద్దరు లేదా ముగ్గురు కానిస్టేబుళ్లతో పాటు అదనంగా మరో 25 మంది పోలీసుల భద్రతను కల్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments