తమిళనాడు ఆర్టీసీ బస్సులో... తడ వ‌ద్ద గంజాయి పట్టివేత

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (19:37 IST)
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలం, బీవీ పాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద  శుక్రవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు చేపట్టిన వాహన తనిఖీలలో 12 కేజీల గంజాయిని పట్టుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ యు వి ఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నెల్లూరు ఆదేశాల ప్రకారం వివిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద వాహన తనిఖీలు చేప‌ట్టారు. నెల్లూరు నుండి చెన్నైకి వెళుతున్నతమిళనాడు ఆర్టీసీ బస్సులో  ప్రయాణిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన శంకత్ అలీ, శన్వస్ ఇద్దరు వ్యక్తుల నుండి 12 కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

 
పట్టుబడిన వ్యక్తులు విచారించగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం ప్రాంతం నుండి  కొనుగోలు చేసిన 12 కేజీల గంజాయిని కేరళ రాష్ట్రంలో కేజీ 20 వేల చొప్పున విక్రయిస్తున్న‌ట్లు విచారణలో నిందితులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సి ఐ ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్  సిఐతో పాటు ఎస్ ఐ ప్రతాప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ ఎన్ రసూల్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పి వెంకటేశ్వర్లు ఎం ప్రభాకర్ రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments