Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానిటర్ ఆన్‌చేయకుండానే టీడీపీ నేతల టెక్నాలజీ శిక్షణా తరగతులు

కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని పార్టీ నేతలకు చేరువ చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, విజయవాడ కేంద్రంగా టెక్నాలజీ శిక్షణా తరగతులు కూడా ప్రారంభిం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (16:50 IST)
కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని పార్టీ నేతలకు చేరువ చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, విజయవాడ కేంద్రంగా టెక్నాలజీ శిక్షణా తరగతులు కూడా ప్రారంభించారు. అయితే, ఈ శిక్షణా తరగతులకు వచ్చిన టీడీపీ నేతలు మాత్రం కంప్యూటర్ మానిటర్ ఆన్ చేయకుండానే టెక్నాలజీ గురించి తెలుసుకునే స్థాయికి ఎదిగిపోయారు. 
 
తాజాగా విజయవాడలో టీడీపీ నేతలకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వ్యవహారంలో ఇలాంటి పొరపాటే జరిగింది. పాలనకు టెక్నాలజీని ఎలా జోడించాలనే విషయమై టెక్ విద్యార్థుల చేత టీడీపీ నేతలకు చంద్రబాబు పాఠాలు చెప్పించారు. ఈ కార్యక్రమానికి  సంబంధించిన కొన్ని ఫోటోలను టీడీపీ బయటకు విడుదల చేసింది. అయితే అసలు మానిటర్ కూడా ఆన్ చేయకుండానే.. కంప్యూటర్ పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా ఉన్న టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ఫోటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్లు సెటైర్లు విసురుతున్నారు. 
 
మానిటర్ కూడా ఆన్ చేయకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఇలా ఫోటోలకు పోజులిచ్చారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో గానీ మొత్తానికి టీడీపీ శిక్షణా తరగతుల వ్యవహారంపై నెటిజెన్లు మాత్రం మండి పడుతున్నారు. శిక్షణ ఇచ్చే విద్యార్థి మౌస్ పట్టుకుని గద్దె రామ్మోహన్‌కు టెక్ పాఠాలు చెబుతున్నట్లుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది. అయితే కేవలం అది ఫోటో‌కు ఫోజే గానీ మానిటర్ ఆన్ చేయకుండానే పాఠాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chitra Purushotham: ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఫోజులిచ్చి ఆన్‌లైన్‌‌లో వైరల్ (Video)

అమ్మాయిలు క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాకు బాగా నచ్చుతుంది : హీరో నితిన్

అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట?

జూన్ లో చిరంజీవి షూటింగ్ ప్రారంభిస్తామన్న అనిల్ రావిపూడి

మిథున్ చక్రవర్తి లవ్ స్టొరీ బిగిన్స్ చిత్రం మొదలైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments