Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో ఇక మాటల్లేవ్... చేతల్లో చూపిస్తాం : ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్

పాకిస్థాన్‌తో ఇకపై మాటలుండవని అన్నీ చేతల్లోనే చూపిస్తామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ అరూప్ సహా ప్రకటించారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (16:33 IST)
పాకిస్థాన్‌తో ఇకపై మాటలుండవని అన్నీ చేతల్లోనే చూపిస్తామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ అరూప్ సహా ప్రకటించారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ.... పఠాన్‌కోట్, యురీ దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తిప్పికొడతామని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత వాయిసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు. 
 
దేశ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులను తిప్పికొట్టేందుకు కొత్తగా పలు భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. నేరుగా పాక్‌ను ప్రస్తావించకుండా, ప్రతి దాడి తమను మరింత అప్రమత్తం చేస్తోందన్నారు. ఎవరి నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా సుశిక్షితులైన భారత బలగాలు ధీటైన గుణపాఠం చెప్పితీరుతాయన్నారు. సెక్యూరిటీ ట్రైనింగ్, ఫిజికల్ ఫిట్నెస్, వాయిసేన పోరాట సామర్థ్యం పెంచడం వంటి ఎన్నో చర్యలు తీసుకున్నామని చెప్పారు.
 
ఇకపోతే.. భారత్ సర్జికల్ దాడులను ప్రస్తావిస్తూ, దీనిపై చాలాచర్చే జరిగిందని, అయినా సైన్యం మాత్రం దాని గురించి మాట్లాడదని చెప్పారు. 'లక్షిత దాడులపై దేశంలో చాలా చర్చ జరిగింది. సమాజంలోని అన్ని వర్గాల వారు దానిపై మాట్లాడారు. జాతి అంచనాలకు అనుగుణంగానే సైన్యం వ్యవహరించింది. దాని గురించి మేము మాటల్లో చెప్పం. చేతల్లోనే మా సత్తా ఏమిటో చూపుతాం' అని అరూప్ రహా స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments