Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపురాణిని నిర్ణయించేంది రాజే కదా? జీవీఎల్ నరసింహా రావు

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (11:12 IST)
రాణులు ఎంతమంది ఉన్నప్పటికీ పట్టపురాణిని మాత్రం నిర్ణయించేంది మాత్రం రాజేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చెప్పుకొచ్చారు. అలాగే, రాజధానులు ఎన్నివున్నా.. సచివాలయం ఎక్కడ ఉంటుందే అదే రాజధాని అవుతుందనీ, దాన్ని నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వమేనని జీవీఎల్ వ్యాఖ్యనించారు. 
 
మూడు రాజధానుల అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకుని తెదేపా నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను బీజేపీకి స్పెషల్ ఏజెంటునని ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. 
 
ఇకపోతే, మూడు రాజధానుల అంశంలో కేంద్రమంత్రులు చెప్పిన మాటలే తాను కూడా చెప్పానని, అది కొందరికి నచ్చక వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని జీవీఎల్ స్పష్టం చేశారు.
 
ఏపీ రాజధాని గురించి చెబుతూ, సాధారణంగా రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటే దాన్నే రాష్ట్ర రాజధానిగా భావించాల్సి ఉంటుందని అన్నారు. రాణులు ఎంతమంది ఉన్నా పట్టపురాణిని నిర్ణయించేది రాజేనని, రాష్ట్ర రాజధాని వ్యవహారం కూడా అంతేనని స్పష్టం చేశారు. ఏపీలో రాజధానులు ఎన్ని ఉన్నా ప్రధాన రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments